
ప్రఖ్యాత భారతీయ ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత చంద్రశేఖర సుబ్రహ్మణ్యం (1910-1995) మరణించినప్పుడు.. "విశ్వంలోని నక్షత్రాలన్నీ అనాథలయ్యాయి" అని ప్రపంచ పత్రికలు రాశాయి. దీని వెనక ఒక నేపథ్యం ఉంది. చంద్రశేఖర్ ను ఒక సందర్భంలో ఓ విలేకరి ఇంటర్వ్యూ చేశారు. ఆయన సిధ్ధాంతాలు, పరిశోధనల గురించి అడిగిన తర్వాత వ్యక్తిగత విషయాల పై దృష్టి సారించారు. మీకు ఎంత మంది పిల్లలు అని అడిగారు. దానికి సరదాగా జవాబిస్తూ.. అనంత విశ్వంలో ఉన్న నక్షత్రాలన్నీ నా సంతానమే! అని చంద్రశేఖర్ చెప్పారు. వాస్తవమేమిటంటే ఆయనకు సంతానం లేదు. ఈ ఇంటర్వ్యూ అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా చంద్రశేఖర్ చెప్పిన సరదా సమాధానం చాలామంది శాస్త్రవేత్తలకు ఆసక్తిదాయకమైంది. తర్వాత ఆయన మరణించినప్పుడు.. నక్షత్రాలు అనాధలయ్యాయంటూ చంద్రశేఖర్ కు పత్రికలు నివాళులు అర్పించాయి..
1 అభిప్రాయాలు:
మంచి సమాచారం
Post a Comment
Thank you for your comments