2007/08/12

సైన్స్ మరమరాలు: లెక్కలే సర్వస్వం

ఒక రంగంలో విపరీతమైన ఇష్టం ఉన్నవారికి ఇక వేరే వాటి గురించి ఏమాత్రం పట్టదు. దానిద్వారా ఎన్ని నష్టాలు సంభవిస్తున్నా.. తమ ధోరణిని మార్చుకోరు. ఇటువంటి వారు చాలా అరుదు. వారిలో.. ప్రఖ్యాత భారతీయ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ (1887-1920) ఒకరు. లెక్కల్లో తన తరగతికన్నా ఎంతో పెద్దవారికి సైతం పాఠాలు చెప్పగల రామానుజన్.. ఇతర సబ్జెక్టుల్లో మాత్రం పాస్ మార్కులు కూడా తెచ్చుకునేవారు కాదు. ఫలితంగా.. ఆయన కనీసం డిగ్రీ కూడా సాధించలేకపోయారు. అయితే, ఆయన ప్రతిభను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం గుర్తించింది. గణితశాస్త్రానికి రామానుజన్ చేసిన సేవలను గుర్తిస్తూ..బీఏ డిగ్రీని ఇచ్చి గౌరవించింది.

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments