2008/01/11

వాళ్లనుకున్నట్లు జరిగి ఉంటే?



"అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని" అన్న కవి మాటలు ప్రపంచ ప్రసిద్ది చెందిన కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలకు తెలిసినట్టు లేదు. 1897లో ఈ పరిశోధనశాలలో మొట్టమొదటిసారి ఎలక్ట్రాన్ ను నోబెల్ బహుమతి గ్రహీత సర్ జె.జె. ధామస్ (1856-1940) గుర్తించారు. ఆ తరువాత జరిగిన ఓ విందు సమావేశంలో కావెండిష్ ల్యాబరేటరీ శాస్త్రవేత్తలంతా మూకుమ్మడిగా అనుకున్న సంగతేమిటో తెలుసా? "The electron - may it never be of use to anybody" అంటే మేం కనుక్కున్న ఎలక్ట్రాన్ ప్రపంచంలో ఎవరికీ అక్కరకు రాకుండా ఉండుగాకా అని! ఎలక్ట్రాన్ వల్ల ప్రయోజనమేమీ ఉండదని వారు భావించడమే దీనికి కారణం. కానీ ఆ తరువాతికాలంలో ఈ ఎలక్ట్రానే... ప్రవాహంగా మారి విద్యుత్తును... తద్వారా నేటి ఆధునిక జీవితాన్ని ఇచ్చింది!

1 అభిప్రాయాలు:

S said...

Its not J.J.Thomas. Its J.J.Thomson as far as I know...

Post a Comment

Thank you for your comments