2007/12/12

ఫెర్మీ ప్రశ్నలు...



ప్రశ్నించడం జిజ్ఞాసకు ప్రతీక. ఈ లక్షణం చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే కొందరికి పెద్దయిన తరువాత కూడా ప్రశ్నలు వేధిస్తూనే ఉంటాయి. అమెరికా అణుబాంబును అందించిన ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) అలాంటి వాడే. శాస్త్ర సాంకేతిక అంశాలతోపాటు, మనం పట్టించుకోని చిన్న విషయాలపై కూడా ఆయన తనను తాను ప్రశ్నించుకునేవారు. ఓసారి ఆయన ప్రయాణిస్తున్న కారు కిందపడి కొన్ని కుందేళ్లు చనిపోయాయి. ఆ వెంటనే ఫెర్మీ ఆలోచనలు మొదలయ్యాయి. కారు ప్రయాణిస్తున్న వేగం, చనిపోయిన కుందేళ్ల సంఖ్యను బట్టి... ఒక చదరపు మీటర్ వైశాల్యంలో ఎన్ని కుందేళ్లు ఉండి ఉండవచ్చునని లెక్కలు కట్టడం మొదలుపెట్టారు. ఓ పుట్ బాల్ మైదానంలో ఎన్ని గడ్డిపోచలుంటాయి? ఒక పట్టణంలో పియానోలు మరమ్మతు చేసే వాళ్లు ఎంతమంది ఉంటారు? ఇలా ఆయన ప్రశ్నలకు అంతూ పొంతూ ఉండేది కాదు. చివరకు ఇలాంటి ప్రశ్నలు... 'ఫెర్మీ ప్రశ్నలు'గా పేరొందాయి.

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments