2007/12/03

ఘననివాళి



సైన్స్ ఆకాశంలో ధృవతారలుగా నిలిచిన శాస్త్రవేత్తలలో జాన్ డాల్టన్ (1766-1844) ఒకరు. పదార్ధం పరమాణు నిర్మితం అన్న విషయాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త డాల్టన్. ఈ బ్రిటీష్ శాస్త్రవేత్త పట్ల ఆయన దేశీయుల్లో గొప్ప అభిమానం ఉండేది. మాంఛెస్టర్ లో డాల్టన్ చనిపోయిన సందర్భంలో ఆ అభిమానం వ్యక్తమయింది. డాల్టన్ పార్ధివ శరీరాన్ని 40 వేల మంది సందర్శించారు. ఆయన అంత్యక్రియలకు వేలసంఖ్యలో హాజరైనారు. అంతేకాదు.. ఆ రోజు మాంఛెస్టర్ నగరంలో అన్ని వ్యాపార సంస్ధలు, కార్యాలయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. తమ ప్రియతమ శాస్త్రవేత్తకు బ్రిటీషర్లు ఈ విధంగా నివాళిని సమర్పించారు.

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments