2007/11/08

20 ఏళ్ల ఆలస్యం అయింది.. అయితే ఏంటి?


ఒక్కోసారి మన కళ్లు మననే మోసం చేస్తుంటాయి.. దారిలో ఓ వజ్రం కనిపించినా.. ఆ.. గాజుముక్కే మోలే.. అనుకుని దాని పక్కనుంచి నడిచివెళ్తాం. శాస్త్రపరిశోధన రంగంలోనూ ఇటువంటి సంఘటనలు జరిగాయి. స్వీడన్ కు చెందిన రసాయనశాస్త్రవేత్త స్వాంటీ అర్హీనియస్ (1859-1927), విద్యార్ధిగా ఉన్న రోజుల్లో.. పీహెచ్.డీ. కోసం ఒక ధీసిస్ రాశారు. దానిని ప్రముఖ రసాయనశాస్త్రవేత్త పెర్ టియేడర్ క్లివ్ (1840-1905) పరిశీలించారు. క్లివ్.. ఏ లోకంలో ఉన్నారోగానీ.. దానికి పీహెచ్.డీ. ఇవ్వటానికి అంగీకరించలేదు. అయితే, ఇరవై ఏళ్ల తర్వాత విచిత్రంగా.. ఆ ధీసిస్ కే నోబెల్ బహుమతి వచ్చింది. ఇంకా విచిత్రమేమంటే.. రసాయనశాస్త్రంలో నోబెల్ బహుమతి కోసం వచ్చిన ఎంట్రీల్లో అర్హీనియస్ సిద్ధాంతాన్ని ఎంపిక చేసింది స్వయంగా.. క్లివే.

1 అభిప్రాయాలు:

naresh veeramas the ROCK said...

THERE IS A PROVERB IN BIBLE. " A RAI AITHE ILLU KATTADAANIKI NIRAAKARINCHABADUTHUNDO ADE RAI AA INTIKI KI THALA RAI AVUTHUNDI ANI" AA MAAT AIKKADA VARTHISTUNDANUKUNTAANU

Post a Comment

Thank you for your comments