2007/10/04

కర్ణుడి అభిమాని జగదీశ్ చంద్రబోస్





మొక్కలకు కూడా జంతువుల మాదిరి ప్రాణం ఉంటుందని ఈ లోకానికి శాస్త్రపరంగా తొలిసారిగా చెప్పిన జగదీశ్ చంద్రబోస్ (1858 - 1937), ప్రపంచ ప్రసిద్ది చెందిన 'ది లివింగ్ అండ్ నాన్ లివింగ్'(1902), 'ది నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్' (1926) అనే గొప్ప సైన్స్ పుస్తకాలు మాత్రమే కాదు, సైన్స్ ఫిక్షన్ నవల రచన కూడా చేసేవారు. మొట్ట మొదటి బెంగాలి సైన్స్ ఫిక్షన్ నవల 'నిరుద్దెశేర్ కహిని' (1896) అయన రాసినదే. బోస్ మరియు విశ్వకవి రవీంద్రనాధ్ టాగూర్ మంచి స్నేహితులు. మంచి స్నేహం మంచికి నాంది అని, ఇరువురి మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు చక్కటి సాహిత్యంతో, కవితలతో ఉండేవి. బోస్ కు కర్ణుడి పాత్ర అంటే చాలా అభిమానం, జాలి కూడా అందుకే ఎలాగైనా కర్ణుడి పాత్రను చిరస్మరణీయం చేయాలని రవీంద్రుడిని కోరారు. ఫలితంగా 'కుంతి-కర్ణ సంవాదం' అనే హృద్యమైన పద్యరచన రవీంద్రుడి కలం నుంచి జాలువారింది.

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments