2007/08/19

సైన్స్ మరమరాలు: ఒక్కసారిగా చరిత్రలోకి!




ఒక్కటంటే ఒక్క పరిశోధనతో శాస్త్ర ప్రపంచంలో చిరస్ధాయిగా నిలిచిపోవడం అన్నది చాలా అరుదు. వెర్నెర్ హైసన్ బర్గ్, సత్యేంద్రనాధ్ బోసులు ఇలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలోకి చేరతారు. 27 ఏళ్ల వయసులో హైసన్ బర్గ్ (1901-1976) "On the Perceptual Content of Quantum Theoretical Kinematics and Mechanics" పేరుతో తొలి పరిశోధన పత్రం ప్రచురించారు. 1927 లో ప్రచురించిన ఈ పత్రంలోని అంశమే.. హైసన్ బర్గ్ అనిశ్చితి సూత్రంగా స్ధిరపడిపోయింది. 1924 లో భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాధ్ బోసు (1894-1974) తాను ప్రతిపాదించిన "Planck's law and the Light Quantum Hypothesis" సిద్ధాంతాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్ స్టైన్ కు పంపారు. ఆ సమయంలో తాను చరిత్రలో నిలిచిపోయే పని ఒకటి చేశానని బోసుకు సైతం తెలియదు. బోసు పంపిన ప్రతిపాదనే... భౌతికశాస్త్రంలో అతికీలకమైన Boson అన్న దృగ్విషయానికి కారణమైంది..

0 అభిప్రాయాలు:

Post a Comment

Thank you for your comments